వికారాబాద్ : కరోనా నేపథ్యంలో తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లో ఆంక్షలు విధించారు. ఈ రోజు నుంచి జిల్లాలోని కొడంగల్ మండలం రావులపల్లి, తాండూర్ మండలం కొత్లా పూర్ల వద్ద అధికారులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం పోలీసు, రెవెన్యూ, మైనింగ్, రవాణా, అటవీ శాఖల ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ మేరకు కలెక్టర్ పౌసమిబసు కర్నాటక నుంచి తెలంగాణకు వచ్చే వాహనాలపై నిఘా పెంచాలని అధికారులను ఆదేశించారు. కాగా, ఈ చెక్ పోస్ట్లు ఇక నుంచి 24 గంటలు పని చేస్తాని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మైనర్ వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు
అంబులెన్స్లోనే కరోనా గర్భిణి ప్రసవం
సీఎం కేసీఆర్ వెంటే మంథని ప్రజలు
అజిత్ సింగ్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
కరోనా కష్టకాలంలో రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం