హైదరాబాద్ : సీఎం కేసీఆర్ పాలనలోనే నాయూ బ్రహ్మణులకు గుర్తింపు లభించిందని రాష్ట్ర నాయీ బ్రహ్మణ సంఘం అధ్యక్షుడు రాసమల్ల బాలకృష్ణ పేర్కొన్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామని ఆయన తెలిపారు. నాయీ బ్రాహ్మణులు నిర్వహిస్తున్న సెలూన్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన వరం అని ఆయన అభివర్ణించారు.
అందుకు కృతజ్ఞతగా ఆ సంఘం ప్రతినిధులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని హైదరాబాద్లో కలసి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇది బడుగుల ప్రభుత్వం అని చరిత్రలోనే ముందెన్నడూ లేని విధంగా బడుగుల అభివృద్ధికి పని చేస్తున్న కేసీఆర్ నాయకత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉందన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గడల రాజు, విద్యాసాగర్, మంచికంటి కరుణాకర్తో పాటు సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జంపాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
రైతు బీమా తరహాలో గీత కార్మికులకు బీమా పాలసీ : మంత్రి హరీశ్రావు
మనం మాస్కులు ఇంకా ఎన్ని రోజులు పెట్టుకోవాలి.. ప్రభుత్వం మాట ఇదీ!
రైతులు, కూలీలను ఆప్యాయంగా పలుకరించిన మంత్రి కేటీఆర్