Uday Nagaraju | చిగురుమామిడి: హుస్నాబాద్ నియోజకవర్గం శనిగరం (Sanigaram) గ్రామానికి చెందిన చెందిన ఉదయ్ నాగరాజు యునైటెడ్ కింగ్డమ్ హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఇటీవల సొంతూరుకు వచ్చిన ఆయనను సిద్దిపేటలో మాజీ జడ్పీటీసీ తన్నీరు శరత్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ హాజరయ్యారు.
తెలంగాణ ప్రాంతం నుంచి లండన్ పార్లమెంటు సభ్యునిగా ఎన్నికై ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ప్రతిష్టను ఇనుమడింపజేసిన ఉదయ్ నాగరాజు నియోజకవర్గంతో పాటు రాష్ట్రానికి గర్వకారణం అని బీఆర్ఎస్ (BRS) నాయకులు కొనియాడారు. భారత్- యూకే సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో చిగురుమామిడి మండలానికి చెందిన బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాసరెడ్డి, సాంబారి కొమురయ్య పాల్గొన్నారు.