వికారాబాద్ : వైద్యులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలి. డ్యూటీ ప్రాంతాల్లోనే నివాసం ఉండాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తాండూరులోని జిల్లా దవాఖానను మంత్రి సందర్శించి వ్యాక్సినేషన్ సెంటర్ను పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో కొవిడ్- 19 పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..గ్రామాల్లో సర్పంచ్ లు,సెక్రటరీలు అలెర్ట్ గా ఉండాలన్నారు. వ్యాక్సినేషన్ సెంటర్లు ,కరోనా టెస్టులు దూరంగా ఉండేటట్లు చూడాలి. అవసరం ఉంటే గ్రామాల్లో ఖాళీగా ఉన్న పాఠశాలలను వాడుకోవాలని అధికారులకు సూచించారు.
జిల్లా పరిధిలో ఎప్పటికప్పుడు ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో ఖాళీగా ఉన్న బెడ్ ల వివరాలు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. కరోనా రెండో దశ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున పకడ్బందీ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా మే 1 నుంచి ప్రారంభం అయ్యే వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి ప్రణాళికలు రూపొందించాలన్నారు. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందితో పాటు, ఆశ కార్యకర్తలు కొవిడ్ 19 పై పోరాటం చేస్తున్నారు. వారి కృషి ప్రశంసనీయమని అభినందించారు. మెడికల్, రెవెన్యూ తో పాటుగా పోలీస్ శాఖ వారు సమన్వయం తో పని చేయాలన్నారు.
జిల్లా పరిధిలో ని మహవీర్ దవాఖానలో 150బెడ్లు, సాయి డెంటల్ కళాశాల లో 50 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. తాండూరు దవాఖానలో 50 బెడ్లకు అదనంగా మరో 50 బెడ్లు కోవిడ్ బాధితుల కోసం ఏర్పాటు చేస్తామన్నారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి , కలెక్టర్ పౌసుమి బసు, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ మురళి, మునిసిపల్ చైర్ పర్సన్ స్వప్న, అడిషనల్ కలెక్టర్లు మోతీలాల్,చంద్రయ్య ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
దేశంలో 60 శాతం వరిసాగు తెలంగాణలోనే..
యాదాద్రిలో స్వాతినక్షత్ర పూజలు
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి
భారత్ మమ్మల్ని వ్యాక్సిన్లు అడగలేదు: అమెరికా