వికారాబాద్ : జిల్లాలోని తాండూరులో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ సర్కార్ రైతులకు ఇబ్బందులు రావొద్దొనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు.
రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అన్నదాతలకు అండగా ఉంటుందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మెన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
దేశంలో 60 శాతం వరిసాగు తెలంగాణలోనే..
యాదాద్రిలో స్వాతినక్షత్ర పూజలు
భారత్ మమ్మల్ని వ్యాక్సిన్లు అడగలేదు: అమెరికా
ఇండియా నుంచి వచ్చే విమానాలపై ఆస్ట్రేలియా నిషేధం