హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 20 వరకు రేషన్ బియ్యం పంపిణీని కొనసాగించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీన ప్రారంభమై.. 15వ తేదీవరకు బియ్యం పంపిణీ కొనసాగుతుంది. అయితే ఈ నెల కొన్ని కారణాలతో పంపిణీ మూడు రోజులు ఆలస్యంగా ప్రారంభమయ్యింది. దీంతో లబ్ధిదారుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో ఈ నెల 18 వరకు, మరికొన్ని జిల్లాల్లో 20 వరకు బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి