న్యూఢిల్లీ, మే 16: ఆర్టీపీసీఆర్ పరీక్షలలో నెగిటివ్ వచ్చినా శరీరంలో కరోనా లక్షణాలు కనిపిస్తే మరోసారి టెస్టు చేయించుకోవాలని ఢిల్లీలోని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) తెలిపింది. జ్వరం, పొడిదగ్గు, అలసట, వాసన కోల్పోవడం, తలనొప్పి, శరీరంపై దద్దుర్లు వంటివి వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా ఇంట్లోనే ఐసోలేషన్లో ఉండటం మంచిదని సూచించింది. కరోనా వచ్చినవారిలో ఇవి మొదటి సూచనలని, ఇప్పటివరకు వైరస్ సోకివారిలో 80 శాతం మందిలో ఈ తరహా లక్షణాలే కనిపించాయని ఎయిమ్స్ వైద్యుడు డాక్టర్ నీరజ్ నిశ్చల్ తెలిపారు.