నిజామాబాద్ : జిల్లాలోని ఎస్సారెస్పీకి ఎగువ ప్రాంతాల నుంచి 33,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నదని ఏఈఈ రవి తెలిపారు. దీంతో ప్రాజెక్ట్ ఏడు వరద గేట్లు ఎత్తి 24,960 క్యూసెక్కులు, ఎస్కేప్గేట్ల నుంచి 7500 క్యూసెక్కుల మిగులు జలాలను దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.
సరస్వతీ కాలువకు 800, లక్ష్మీ కాలువకు 80 క్యూసెక్కుల నీటివిడుదల కొనసాగుతున్నదని తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా బుధవారం సాయంత్రానికి పూర్తిస్థాయి నీటి నిల్వ ఉందని పేర్కొన్నారు.
ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి ఈ సీజన్లో 658.779 టీఎంసీ వరద వచ్చినట్లు తెలిపారు. గోదావరి, కాలువలకు 585,902 టీఎంసీల మిగుల జలాలను వదిలినట్లు వివరించారు.
ఇవి కూడా చదవండి..
Nallagonda |చిట్యాల వద్ద భారీగా నగదు పట్టివేత
Crime news | రౌడీ షీటర్ హల్చల్..యువకుడిపై కత్తితో దాడి
రైతన్న సినిమాను విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి