జనగామ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు చట్టాల అమలుకు వ్యతిరేకంగా నటుడు, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి తీసిన ‘రైతన్’ సినిమాను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పిలుపునిచ్చారు.
బుధవారం జనగామలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని కలిశారు. జనగామ జిల్లా కేంద్రంలో సినిమాను విజయవంతం చేయాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడుతూ..తాను కూడా ఈ నెల 23న ఉదయం 10 గంటలకు జనగామలో ‘రైతన్న’ సినిమాను చూస్తాననని తెలిపారు.
అలాగే తనతో పాటు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు చేసేలా చేస్తామన్నారు. అన్నదాతల కష్టాలను కండ్లకు కట్టిన రైతన్న సినిమాను జయప్రదం చేయాలన్నారు.