టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య అనుష్క శర్మ క్వారంటైన్ ముగిసింది. దీంతో కోహ్లీ తన భార్య అనుష్క శర్మ, కుమార్తె వామికాతో కలిసి దుబాయ్లో బుధవారం ఉదయం అల్పాహారం తీసుకున్నారు. ఈ ఫోటోను కోహ్లీ తన ట్విటర్ పేజీలో షేర్ చేసి ప్రేమను వ్యక్తపరిచారు. దుబాయ్లో ఆస్ట్రేలియాతో టీమిండియా.. టీ20 రెండో వార్మప్ మ్యాచ్ ఇవాళ ఆడనుంది.
సోమవారం సాయంత్రం అనుష్క శర్మ తన భర్త కోహ్లీ, కుమార్తె వామికా ఫోటోను తన ఇన్స్టాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. కలర్ఫుల్ బాల్స్ మధ్యలో వామికా కూర్చొని ఆడుకుంటుండగా.. ఆమెను చూస్తూ కోహ్లీ నవ్వుతున్న ఫోటోను అనుష్క షేర్ చేసింది. ఈ ఒక్క ఫ్రేమ్లోనే తన హృదయం ఉందని అనుష్క క్యాప్షన్ ఇచ్చారు.