జోగులాంబ గద్వాల : జిల్లా దవాఖానలో కరోనాతో చేరిన రోగులకు నిత్య అన్నదానం చేయనున్నట్లు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని దవాఖానలో చికిత్స పొందుతున్న రోగులకు నిత్య ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైద్యం కోసం వస్తున్న నిరుపేదలు, అభాగ్యులు, బాధితులు ఎవరూ కూడా అన్నం లేక అల్లాడ కూడదనే ఉద్దేశంతో దాతల ప్రోత్సాహంతో రోగులకు, వారి సహాయకులకు ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు.
గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న కరోనా రోగులు, వారి కుటుంబాలకు మొత్తం 630 మందికి ఎమ్మెల్యే ఆహారం అందజేశారు. కొవిడ్ చికిత్సతోపాటు వైద్య పరీక్షల నిమిత్తం గద్వాల పట్టణానికి విచ్చేస్తున్న అనేక మంది బాధితులు భోజన సదుపాయాలు, హోటల్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బాధితులకు ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అభిమానుల సహాయంతో ఆహారాన్ని అందజేస్తానని ఆయన తెలిపారు.
అదేవిధంగా దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఇలాంటి సమయంలోనే మానవతా దృక్పథంతో సహృదయతను చాటాలన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బీయస్ కేశవ్, జెడ్పీటీసీ రాజశేఖర్, జిల్లా వైద్యాధికారి చందు నాయక్, వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్స్ నాగిరెడ్డి, నరహరి శ్రీనివాసులు, నాగరాజు, టీఆర్ఎస్ నాయకుడు ఆలూరు రాము శెట్టి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మానవత్వం చాటిన చెన్నూర్ పోలీసులు
వనపర్తి జిల్లాకు నూతనంగా ఐదు వెంటిలేటర్లు
పర్వతగిరి పీహెచ్సీని సందర్శించిన ఎమ్మెల్యే ఆరూరి
కోల్కతా సీబీఐ ఆఫీస్ ముందు టీఎంసీ ఆందోళన
కొవిడ్ చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సత్యవతి