మంచిర్యాల : జిల్లాలోని చెన్నూర్ పోలీసులు తమ మానవత్వాన్ని చాటారు. బతుకు దెరువు కోసం వలసొచ్చిన కుటుంబాలకు లాక్ డౌన్తో ఉపాధి కోల్పోయిన ఎగ్జిబిషన్ సిబ్బందికి ఆపన్నహస్తం అందించారు. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని నాగపూర్ కొంతమంది నుంచి పొట్ట చేత పట్టుకొని ఎగ్జిబిషన్ (ఆటవిడుపు) నడిపిద్దామని చెన్నూర్ పట్టణానికి వచ్చారు. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో వారు జీవనోపాధి కోల్పోవాల్సి వచ్చింది.
వారి దయనీయపరిస్థిని చూసిన పోలీసులు పెద్ద మనసుతో స్పందించారు. వారికి ఒక నెలకు సరిపడా నిత్యావసర వస్తువులతో పాటు కొంత నగదును చెన్నూర్ ఎస్ఐ వినోద్ చేతుల మీదుగా వారికి అందజేశారు. వీరికి సహకరించిన ఏఎస్ఐ బాలయ్య, హోంగార్డు రమేష్, లక్ష్మి, మేకల మండి శ్రీనివాస్ను పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ అభినందించారు.
ఇవి కూడా చదవండి..
వనపర్తి జిల్లాకు నూతనంగా ఐదు వెంటిలేటర్లు
పర్వతగిరి పీహెచ్సీని సందర్శించిన ఎమ్మెల్యే ఆరూరి
కోల్కతా సీబీఐ ఆఫీస్ ముందు టీఎంసీ ఆందోళన