వరంగల్ రూరల్ : పర్వతగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై వైద్యులను, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కరోనా పరీక్షలు, మందుల పంపిణీ, వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా చూడాలని వైద్యులకు సూచించారు. అనంతరం ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని ప్రజలకు సూచించారు.