మహబూబాబాద్ : రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. గార్ల మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కొవిడ్ చికిత్సా కేంద్రాన్ని జడ్పీ చైర్పర్సన్ కుమారి బిందు, స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, కలెక్టర్ వి.పి గౌతమ్ తో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కొవిడ్ బారిన పడ్డ రోగులకు ఎక్కడికక్కడ స్థానికంగా సరైన వైద్యం సత్వరమే అందించే లక్ష్యంతో ప్రభుత్వ హాస్పిటల్స్ ను మండల కేంద్రాల్లోనూ పటిష్టం చేస్తున్నట్లు చెప్పారు.
ఇందులో భాగంగానే గార్లలో కొవిడ్ బారిన పడ్డ రోగులకు వైద్యం అందించేందుకు 20 ఆక్సిజన్ బెడ్లు, మరో 10 అబ్జర్వేషన్ బెడ్లతో కలిపి ఏర్పాటు చేసిన కొవిడ్ ఎంతో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలో కోవిడ్ రోగులకు మెరుగైన చికిత్స వెంటనే అందించేందుకు దాదాపు 2000 ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.
ప్రజలు కూడా లాక్ డౌన్ కు సహకరించాలని, కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కోరారు. హాస్పిటల్స్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని రోగులు ధైర్యంగా ఉండాలన్నారు.
ఇవి కూడా చదవండి..
మానవత్వం చాటిన చెన్నూర్ పోలీసులు
వనపర్తి జిల్లాకు నూతనంగా ఐదు వెంటిలేటర్లు
పర్వతగిరి పీహెచ్సీని సందర్శించిన ఎమ్మెల్యే ఆరూరి
కోల్కతా సీబీఐ ఆఫీస్ ముందు టీఎంసీ ఆందోళన