హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వృద్ధాప్య పెన్షన్లకు అర్హతను 57 ఏండ్లకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయించిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఈ నేపథ్యంలో సంబంధిత ప్రక్రియను తక్షణమే ప్రారంభించి, అర్హులైన వాళ్లందరికి పెన్షన్లు అందిస్తామన్నారు. ఈ నిర్ణయంతో కొత్తగా మరో 6,62,000 మందికి ప్రతి నెలా రూ. 2016 వృద్ధాప్య పెన్షన్ అందనున్నదని మంత్రి తెలిపారు.
ఈ మేరకు తమ శాఖ అధికారులు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 60 ఏ0డ్లు నిండిన అర్హత ఉన్న వాళ్లందరికి పెన్షన్లు ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. రైతుబంధు బీమా తరహాలోనే మరికొద్ది రోజుల్లోనే నేత, గీత కార్మికులకు కూడా బీమా ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటనను విడుదల చేశారు.
సీఎం చేతుల మీదుగా ఈ కొత్త పెన్షన్లు ప్రారంభిస్తామని ఆయన అన్నారు.
మిగతా హాస్పిటల్స్ తో పాటు, ఇప్పటికే మంజూరైన వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను కూడా మొదలు పెడతామన్నారు. గత 40 ఎండ్లుగా తన రాజకీయ జీవితంలో, ఇంత గొప్పగా పరిపాలన చేస్తున్న ప్రభుత్వాన్ని, సీఎంని తాను చూడలేదన్నారు.
ఇవి కూడా చదవండి..
తల్లిని వదిలేసిన కొడుకులు..అక్కున చేర్చుకున్న పోలీసులు
హరితహారం మొక్కలు ధ్వంసం.. రూ. 5వేల జరిమానా
కీలక అంశాలపై చర్చకు మోదీ సర్కార్ వెనుకంజ!
Tokyo Olympics: చరిత్రలో ఇంతకు మించిన విజయం ఉండదేమో..!
మెడికల్ హబ్గా మారనున్న మహబూబ్నగర్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్