నిజామాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది.
ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా పచ్చదనాన్ని పెంచేందుకు వందల కోట్లు ఖర్చుపెట్టి మొక్కలు నాటిస్తోంది. వాటి సంరక్షణ బాధ్యతలను కూడా అధికారులకు అప్పగించింది. అయితే కొంతమంది కార్యక్రమాన్ని కొందరు నీరు గారుస్తున్నారు. అలాంటి వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
తాజాగా జిల్లాలోని ధర్పల్లి మండలం హోన్నాజీపేట్ గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను చిన్న మల్లయ్య అనే వ్యక్తి పీకేశాడు. దీంతో గ్రామ సర్పంచ్ భగవంత్ రెడ్డి, కార్యదర్శి రఘురాం మల్లయ్యకు ఐదు వేల రూపాయల జరిమానా విధించినట్లు తెలిపారు. ఎవరైనా హరితహారం మొక్కలను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
వైరల్ వీడియో : కారు డ్రైవర్కు చుక్కలు చూపించిన మహిళ!
కీలక అంశాలపై చర్చకు మోదీ సర్కార్ వెనుకంజ!
Tokyo Olympics: చరిత్రలో ఇంతకు మించిన విజయం ఉండదేమో..!
మెడికల్ హబ్గా మారనున్న మహబూబ్నగర్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్