మహబూబ్నగర్ : భవిష్యత్లో మహబూబ్నగర్ మెడికల్ హబ్గా మారనుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ స్థలం పత్రాలను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం కోసం వైద్య శాఖకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు ఇవాళ మంచిరోజు అన్నారు.
సమైక్య రాష్ట్రంలో సరైన వైద్యం అందక హైదరాబాద్ తీసుకెళ్తుంటే మధ్యలోనే చనిపోయేవారు.
కలెక్టరేట్ను దవాఖానగా మారుద్దామని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని గుర్తు చేశారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ఏర్పాటు చేస్తామన్నారు. కొత్త కలెక్టరేట్ కు మారిన తరువాత ఇక్కడ పని ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. 300 కోట్ల రూపాయలతో హాస్పిటల్ను ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు. త్వరలోనే టెండర్లు పిలుస్తాం.
ఆర్టీసీ బస్ స్టాండ్కు ఎదురుగా..ఇంత పెద్ద స్థలం పేద ప్రజల ఆరోగ్యం కాపాడుకునేందుకు దవాఖానను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. అడగగానే హాస్పిటల్ ఏర్పాటకు అంగీకరించిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
వైరల్ వీడియో : కారు డ్రైవర్కు చుక్కలు చూపించిన మహిళ!
కీలక అంశాలపై చర్చకు మోదీ సర్కార్ వెనుకంజ!
Tokyo Olympics: చరిత్రలో ఇంతకు మించిన విజయం ఉండదేమో..!