వరంగల్ : గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంతో పర్యావరణ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తున్న ఎంపీ సంతోష్ కుమార్ ఆశయం గొప్పదని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ బర్త్ డే సందర్భంగా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యలో గులాబీ శ్రేణులు మూడు వేల మొక్కలు నాటారు.
ఖిలా వరంగల్ మధ్య కోట గుండు చెరువు గుట్ట పక్కన డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, కార్పొరేటర్లు, గులాబీ శ్రేణులతో కలిసి మొక్కలు నాటారు. సరదాగా కార్యకర్తలతో సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగస్వామ్యులైన అందరికి ఎమ్మెల్యే కృతజ్ఙతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Tiger attack | జయశంకర్ జిల్లాలో బర్రెల మందపై పులి దాడి..భయాందోళనలో గ్రామస్తులు
అయ్యప్ప మాలధారణతో దొంగతనాలు..దేహశుద్ధి చేసిన గ్రామస్తులు
Crime news | వేటగాళ్ల ఉచ్చుకు తండ్రి, కొడుకు మృతి..మరొకరికి గాయాలు