సూర్యాపేట : మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధనలో దివంగత ఆచార్య జయశంకర్ సార్ ఒక దిక్సూచి అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని జయశంకర్ చిత్రపటానికి పులమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమం మొదలు పెట్టిన రోజున జయశంకర్ సార్ మార్గదర్శనం చేసారని ఆయన కొనియాడారు.
రాష్ట్ర సాధన కోసం మొదలైన తొలి ఉద్యమంలో ఆయన పాత్ర అజరామరంగా నిలుస్తుందని మంత్రి తెలిపారు.
తెలంగాణ ఉద్యమానికి జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు జయశంకర్ సార్ అని కొనియాడారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో ఆయన లేకపోవడం అన్న బాధ వెంటాడుతున్న ఆయన ఆలోచన విధానం మేరకే ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
‘రైతు బీమా’ దరఖాస్తునకు చివరి తేదీ ఆగస్టు 11
Tokyo Olympics: మెడల్పై ఆశలు రేపుతున్న గోల్ఫర్ అదితి
Nanajipur waterfalls : హైదరాబాద్కు చేరువలో అద్భుతమైన జలపాతం
Lionel Messi: సంచలనం.. బార్సిలోనా నుంచి మెస్సీ ఔట్