Current | హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగా ణ): 24 గంటలు కరెంటు ఇస్తే.. అంతరాయం లేకుండా నడిచి మోటర్లు కాలిపోతాయన్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదు. 24 గంటలు ఇవ్వడం వల్ల ఎప్పుడు అవసరమున్నవాళ్లు అప్పుడు తమ పంపుసెట్లు ఆన్చేసి, అవసరం తీరాక ఆఫ్ చేసుకునే అవకాశాలు ఉంటా యి. దీంతో లోడ్ పెరిగే అవకాశాలు తక్కువని నిపుణులు చెప్తున్నారు. పైగా లోవోల్టేజీ సమస్యలు ఉండవు. కానీ దీనిని భిన్నంగా ప్రచారం జరుగుతున్నది.
వాస్తవానికి గతంలో విడతలవారీగా కరెంటు ఇవ్వడంతోనే మోటర్లు కాలిపోయేందుకు ఎక్కువ అవకాశాలు ఉండేవి. 24 గంటల కరెంటు లేనప్పుడు రైతులకు ప్రతి నిమిషం ముఖ్యమే. దీంతో అంతా ఆటోమేటిక్ స్టార్టర్లు పెట్టుకునే వారు. సబ్స్టేషన్ నుంచి పవర్ సరఫరా కాగానే అన్నీ ఒకేసారి స్టార్ట్ కావడంతో సబ్స్టేషన్పై తీవ్ర ఒత్తిడి పడేది. ఒకేసారి అన్ని మోటర్లు ఆన్కావడంతో లోడ్ పెరిగి మోటర్లు కాలిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడం, ఫ్యూజులు పోవడం వంటివి జరిగేవి. ఇటీవలే పటాన్చెరు ప్రాంతంలో ఇలాంటి ఘటనే జరిగింది. 24 గంటల కరెంటుతో మెటర్లు కాలిపోతాయనేది పూర్తిగా అవాస్తవమని ఇందుకు ఇదే ఉదాహరణ అని ఎస్పీడీసీఎల్లో ఏడీఈగా పనిచేస్తున్న టీఈఈఏ ప్రతినిధి తుల్జారాంసింగ్ పేర్కొన్నారు.
Farmers | ఎడ్ల పెయ్యి కడగడానికీ సాలదు ఆ కరెంటు!.. రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై అన్నదాతల ఆగ్రహం