తుంగతుర్తి, ఆగస్టు 04 : తుంగతుర్తి మండల పరిధిలోని రాళ్లపల్లి ఎక్స్ రోడ్ తండాకు చెందిన గుగులోతు రాజారాం నాయక్ ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తామన్నారు. అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. తన ఎన్నికలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నిక పట్ల మండల నాయకులు, పలువురు హర్షం వ్యక్తం చేశారు.