పుస్తకాలు రాసే విధానానికి ఇకపై స్వస్తి
యాప్లోనే మహిళా సంఘాల నిర్వహణ
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో ప్రయోగాత్మకంగా అమలు
హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) కార్యకలాపాలన్నీ ఇకపై డిజిటలైజ్ చేయనున్నారు. ఇందుకు ప్రత్యేకంగా యాప్ను రూపొందించారు. దీంతోపాటు ఎస్హెచ్జీల్లోని 50 లక్షల మంది సభ్యుల సమగ్ర సమాచారాన్ని సేకరించాలని సెర్ప్ నిర్ణయించింది. మహిళా సంఘాలు ఎప్పుడు బ్యాంకు రుణం తీసుకున్నాయి? ఎవరెవరు ఎంత తీసుకున్నారు? ఎంత తిరిగి చెల్లించారు? వంటి వివరాలన్నీ ఇందులో పొందుపరుస్తారు. సమావేశాలు నిర్వహించుకొనే వివరాలు, ఆ ఫొటోలు, రుణం తీసుకున్న మొత్తంతో ఏ వ్యాపారం చేస్తున్నారు? వాటి ఫొటోలను ఆప్లోడ్ చేస్తారు. ఇలా ఎస్హెచ్జీల సమగ్ర సమాచారం యాప్లో నిక్షిప్తం చేయ నున్నారు. ఈ యాప్ను ప్రయోగాత్మకంగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో ఉపయోగిస్తు న్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయనున్నారు. ప్రతి సంఘంలో అధ్యక్షురాలు లేదా సభ్యురాలికి యాప్ యాక్సెస్ ఇస్తారు. వారి ఫోన్ నంబర్ను సర్వర్లో నమోదుచేసి వివరాలను ఆప్డేట్ చేసేలా అవకాశం కల్పిస్తారు. ఒక వేళ ఆ సంఘంలో యాప్ ఆపరేట్ చేసేవారు ఎవరూ లేకుంటే బయటికివారికి అవకాశం కల్పిస్తారు. ఇప్పటివరకు సంఘాల నిర్వహణ వివరాలను పుస్తకాల్లో రాయడానికి వీవోఏలను నియమించుకున్నారు. వీరికి ట్యాబ్లను కూడా అందించారు. ముఖ్యమైనవాటిని మాత్రమే ట్యాబులలో నమోదుచేస్తున్నారు. పుస్తకాల్లో రాయాల్సి సమాచారాన్ని కనీసస్థాయిలో కూడా రాయడంలేదని అనేక ఫిర్యాదులు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో ఆధిపత్య పోరులో వీవోఏలు సీసీలకు సరైన సమాచారం అందించడంలేదని, వారికి సహకరించడం లేదని గుర్తించారు. వీటన్నిటికీ చెక్ పెడుతూ యాప్ను తీసుకొచ్చారు. ఈ యాప్ ద్వారా తమ పరిధిలోని సంఘాల సమాచారాన్ని సీసీలు, ఏపీఎంలు, డీపీఎంలు చూసుకోవచ్చు.సంఘం సభ్యుల సమాచారం ఒక్క క్లిక్కుతో లభ్యంకానున్నది.
సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్
నిధుల గోల్మాల్పై డీసీసీబీ సీరియస్