ముంబై: కరోనా మహమ్మారి ఒక సంవత్సరం పాటు విజృంభించడంతో దేశంలో పలు కుటుంబాలు అప్పుల ఊబిలో చిక్కుకున్నాయి. వారి దాచి పెట్టుకున్న సేవింగ్స్ ఖర్చయి పోయాయని తాజాగా భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) విడుదల చేసిన ఓ నివేదిక వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రజలు.. కుటుంబాలు తమ వ్యక్తిగత అవసరాల కోసం తీసుకున్న రుణాలు దేశ జీడీపీలో 37.1 శాతానికి చేరాయని ఆ నివేదిక వెల్లడించింది.
2019-20తో పోలిస్తే పొదుపు 10.4 శాతం తగ్గినట్లు తెలిపాయి. కరోనా మహమ్మారి వల్ల లక్షల మంది ఉద్యోగాలు కోల్పోగా, పలు సంస్థలు తమ ఉద్యోగుల శాలరీల్లో భారీగా కోతలు విధించాయి. దీంతో సాధారణ ప్రజానీకం తమ వ్యక్తిగత అవసరాలు తీర్చుకునేందుకు అప్పులు చేయడం గానీ, ఇంతకుముందు పొదుపు చేసిన సొమ్మును గానీ వాడుకున్నారని ఆర్బీఐ వెల్లడించింది.
కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కుటుంబాల పొదుపు 21 శాతానికి పెరిగింది. కానీ మహమ్మారి ప్రభావం దీర్ఘకాలం కొనసాగి ఆదాయాలు పడిపోవడంతో ఆయా కుటుంబాలు పొదుపు చేసిన మొత్తాలను వాడుకున్నాయి. దీంతో రెండో త్రైమాసికంలో కుటుంబాల పొదుపు 10.4 శాతానికి తగ్గింది. గత డిసెంబర్ నెలతో ముగిసిన మూడో త్రైమాసికంలో పొదుపు మరింత పడిపోయే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
అన్నాడీఎంకే ఒక్క సీటు గెలిచినా అది బీజేపీ విజయమే: స్టాలిన్
అలాగేతైనే జూన్ నుంచి ఆభరణాల సేల్స్ !
ఉద్యోగం మారినా పీఎఫ్ నంబర్ ఒకటే