న్యూఢిల్లీ: పెండ్లిండ్లు.. శుభకార్యాల్లో బంగారం వాడకం తప్పనిసరి.. ప్రత్యేకించి పెండ్లిండ్లలో వధువు.. ఇతర మహిళల కోసం ఆభరణాలు, బంగారం కొనుగోలు చేస్తుంటారు. కానీ ఇకముందు సాదాసీదాగా బంగారం కొనుగోళ్లు జరుపడం కష్టం.. ఎందుకంటే వచ్చే జూన్ ఒకటో తేదీ నుంచి హాల్మార్క్ ఉన్న బంగారం ఆభరణాలు మాత్రమే విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
హాల్మార్క్ ఉంటేనే ఆభరణాల విక్రయం
దీంతో హాల్మార్క్ లేకుండా బంగారు ఆభరణాలను వచ్చే జూన్ ఒకటో తేదీ తర్వాత అమ్మడం కష్ట సాధ్యం. ఈ మేరకు రిజిస్టర్డ్ జ్యువెల్లరీ వ్యాపారులందరికీ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ఆదేశాలు జారీ చేసింది. 22 క్యారట్లు, 18 క్యారట్లు, 14 క్యారట్లు స్వచ్ఛత గల బంగారం ఆభరణాలపై హాల్మార్క్ తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. దీనివల్ల కస్టమర్, స్వర్ణ కారుడు ఇద్దరూ ప్రయోజనం పొందుతారని తెలిపింది. బంగారం నాణ్యతపై ఇరు పక్షాలకు ఏ సందేహం ఉండదని పేర్కొంది.
జనవరిలో గడువు పొడిగించిన కేంద్రం
ఇప్పటి వరకు బంగారు ఆభరణాలపై హాల్మార్క్ తప్పనిసరికాదు. కానీ, ఇంతకుముందు గత జనవరి 15లోపు బంగారు ఆభరణాలపై హాల్మార్క్ ఉండాలని కేంద్రం పేర్కొంది. అయితే, జ్యువెలర్స్ అసోసియేషన్ డిమాండ్ మేరకు ఆ గడువును జూన్ ఒకటో తేదీకి పొడిగించారు. ఆభరణాల హాల్మార్కింగ్ ప్రక్రియలో బీఐఎస్ ఎ అండ్ హెచ్ సెంటర్లో నాణ్యతను తనిఖీ చేస్తారు. ఇక్కడ పరీక్షించాక ఎ అండ్ హెచ్ సెంటర్లో ఆభరణాలపై హాల్మార్క్ను ముద్రిస్తుంది.
హాల్మార్క్ రిజిస్ట్రేషన్ ఇలా
రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇప్పుడు ఇంటి నుంచి ఆన్లైన్లో చేయవచ్చు. దీనికోసం వ్యాపారులు ఈ-బీఐఎస్ వెబ్సైట్కు వెళ్లాలి.ఇక్కడ సంబంధిత పత్రాలతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యాక దరఖాస్తుదారుడు బీఐఎస్ రిజిస్టర్డ్ జ్యువెలర్ అవుతారు. బీఐఎస్ రిజిస్ట్రేషన్ ఫీజును కూడా చాలా తక్కువగా నిర్ణయించింది. ఒక ఆభరణాల టర్నోవర్ 5 కోట్ల కన్నా తక్కువ ఉంటే రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 7500, రూ.5 వేల కోట్ల నుంచి 25 కోట్ల మధ్య వార్షిక టర్నోవర్కు రూ.15 వేలు, రూ. 25 కోట్లకు పైగా టర్నోవర్కు రూ. 40 వేలు చెల్లించాల్సి ఉంటుంది. టర్నోవర్ రూ. 100 కోట్లు దాటితే రుసుము రూ.80 వేలుగా కేంద్రం నిర్ణయించింది.
ఇవి కూడా చదవండి:
ఆపిల్పై బ్రెజిల్ 20 లక్షల డాలర్ల ఫైన్.. ఎందుకంటే!
స్క్రాపేజీ పాలసీతో 35 వేల కొలువులు!
షాకింగ్:ఇన్వెస్టర్ల కోసం ‘బిట్కాయిన్’ఏటీఎంలు.. ఎక్కడంటే!