జోగులాంబ గద్వాల : రైతులపై ఎల్ నినో ( El Nino ) ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది . వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఇంకా సరైన వర్షం కురవక పోవడంతో రైతులు నానా తంటాలు పడుతున్నారు. వరికి బదులు ప్రత్యామ్నయ పంటలు సాగుచేయాలని ప్రభుత్వం వివరించడంతో అనేక చోట్ల పత్తి, ఇతర వాణిజ్య పంటలవైపు మళ్లారు.అయితే వేసుకున్న పంటలను కాపాడుకు నేందుకు వర్షం కోసం ఆకాశం వైపు చూస్తూ నిరాశకు లోనవుతున్నారు.

జోగులాంబ గద్వాల ( Jogulamba Gadwal ) జిల్లా మానవపాడు మండలం ( Manavapadu Mandal ) లో రైతు సాగుచేసిన పత్తి పంట ఎండిపోతుండడంతో రైతు కూలీలతో పత్తి ( Cotton ) మొక్కలకు నీరు పోయిస్తూ పంటను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. సమీపంలోని నీటి వనరులున్న ప్రాంతానికి వెళ్లి బకెట్లు, బిందెల సహాయంతో నీళ్లు తీసుకొచ్చి ప్రతి మొక్కకు పోయిస్తున్నారు.