KTR | హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మంత్రి సీతక్క యశోద ఆస్పత్రికి చేరుకున్నారు. కేటీఆర్ డాక్టర్లతో మాట్లాడి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని, ఆయనకు అందుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంసభ్యులను పరామర్శించిన కేటీఆర్, మంత్రి సీతక్క వారిలో మనోధైర్యాన్ని నింపారు. కేటీఆర్ వెంట పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
రెండు రోజుల క్రితమే యశోద హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించుకున్న పెద్దికి ఆదివారం హనుమకొండలోని ఇంట్లో ఉదయం 7 గంటలకు తీవ్రమైన గుండెపోటు రాగా.. ఆయన భార్య స్వప్న వెంటనే దగ్గరలోని రోహిణి హాస్పిటల్కు తీసుకెళ్లారు. కార్డియాలజిస్ట్ మమతారెడ్డి నేతృత్వంలో వైద్యుల బృందం వేగంగా స్పందించి అత్యవసర వైద్యం అందించారు. అత్యవసర సీపీఆర్ అనంతరం మెరుగైన వైద్యం కోసం పెద్ది సుదర్శన్ రెడ్డిని గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్లోని యశోద దవాఖానకు తరలించారని తెలిసిందే.
యశోద హాస్పిటల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన కేటీఆర్, సీతక్క, సంజయ్ https://t.co/bpGB1St1PB pic.twitter.com/M9EORDfGs5
— Telugu Scribe (@TeluguScribe) July 27, 2026
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించడానికి యశోద ఆసుపత్రికి చేరుకున్న కేటీఆర్, సీతక్క, కల్వకుంట్ల సంజయ్ https://t.co/Q0hG0wwNt6 pic.twitter.com/yyg2RY054m
— Telugu Scribe (@TeluguScribe) July 27, 2026