మంచిర్యాల : కరోనా కష్టకాలంలో చెన్నూర్ నియోజకవర్గంలోని కారోనా బాధితులకు ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆపన్నహస్తం అందించారు. ఇమ్యూనిటీ పెంచడంతో పాటు వారి ఆరోగ్యం త్వరగా మెరుగు పడేలా తన వంతు సాయం చేశారు. తన నియోజకవర్గంలో హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్న 1,896 కొవిడ్ బాధితులకు మంగళ వారం పార్టీ నాయకుల సహాయంతో చేయూత అందించారు. ఒక్కొక్కరికి 800 రూపాయల పండ్లు, డ్రైఫ్రూట్స్ ను తన సొంత ఖర్చులతో విప్ సుమన్ సమకూర్చారు. కాగా, వీటిని టీఆర్ ఎస్ పార్టీ నాయకులు పంపిణీ చేశారు.
ఇవి కూడా చదవండి..
భద్రాద్రి జిల్లాలో తీరిన ఆక్సిజన్ కష్టాలు : మంత్రి పువ్వాడ
భూపాలపల్లిలో 30 పడకల కొవిడ్ వార్డు ప్రారంభం
అనాథ పిల్లలకు అండగా ఉంటాం: మంత్రి ఐకే రెడ్డి
సీఎం కేసీఆర్ నిర్ణయంతో వైద్య రంగం బలోపేతం
కరోనా ఉగ్రరూపం.. తల్లడిల్లుతున్న యూపీ పల్లెలు
కరోనా పోవాలని ముత్నుర్లో మహిళల పూజలు