సూర్యాపేట : తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు తుంగతుర్తి ఎమ్మెల్యే కిశోర్ కుమార్ చేయూతనందించారు. నాగారం మండలం ఫణిగిరి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు ఆలకుంట్ల రమేష్-స్వరూప దంపతులు ఇటీవల మృతి చెందారు. తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులు శ్వేత (19) (మానసిక వికలాంగురాలు), శిరీష (17), సంతోష్ (15) సంవత్సరాల ముగ్గురు పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరు వారం రోజుల వ్యవధిలో కరోనా కాటుకు బలి కావడంతో ముగ్గురు చిన్నారులు అనాథలయ్యారు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ వెంటనే స్పందించి కుటుంబ సభ్యులకు రూ.50,000 ఆర్థికసాయం అందజేసి, ఆకుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అలాగే పిల్లల చదువుల కోసం గురుకులాల్లో చేర్పిస్తానని చెప్పారు. ప్రస్తుతం ముగ్గురు చిన్నారుల బాగోగులు వాళ్ల నానమ్మ, పెదనాన్న చూసుకొంటున్నారు. పిల్లలకు నావంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
చౌడాపూర్ నూతన మండలాన్ని ప్రారంభించిన మంత్రి సబిత
రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్
బీజేపీకి షాక్.. టీఎంసీలోకి ముకుల్రాయ్!