సూర్యాపేట : తుంగతుర్తి నియోజకవర్గంలోని పలు మండలాల్లో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఇటీవల నిర్మించిన రైతు వేదికలను ప్రారంభించారు. నాగారం మండలం ఫణిగిరి, వర్ధమానుకోట గ్రామాల్లో, శాలిగౌరారం మండలం మాధారం గ్రామాల్లో రూ. 22 లక్షల చొప్పున వ్యయంతో నిర్మించిన రైతు వేదికలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతు వేదికలను ఉపయోగించుకుని లాభసాటి వ్యవసాయం చేపట్టాలన్నారు. ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు.
వ్యవసాయ అధికారులు రైతులకు నిత్యం అందుబాటులో ఉంటూ తగిన సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమాల్లో జిల్లా రైతు బంధు సమితి కోఆర్డినేటర్ ఎస్ఏ రజాక్, డీఏవో రామారావు, జడ్పీటీసీ ఎర్ర రణిలా, ఎంపీపీలు కూరం మణి, గంట లక్ష్మమ్మ, వైస్ ఎంపీపీ గుంటకండ్ల మణిమాల, మండల పార్టీ అధ్యక్షుడు కలెట్లపల్లి ఉప్పలయ్య, పీఏసీఎస్ చైర్మన్ తాళ్లూరి మురళి, మార్కెట్ చైర్మన్ కట్ట లక్ష్మి వెంకట్ రెడ్డి, వైస్ ఎంపీపీ కందుల అనిత, రైతు బంధు సమితి కోఆర్డినేటర్ గుండా శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు ఐతగోని వెంకన్న తదితరులు పాల్గొన్నారు.