వరంగల్ రూరల్ : పరకాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో రూ.1.98 కోట్లతో పలు అభివృద్ధి పనులకు భూపాలపల్లి ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి శంకుస్థాపన చేశారు. రూ.22 లక్షలతో నిర్మించిన రైతువేదికను ప్రారంభించారు. రూ.73 లక్షలతో ప్రహరీ నిర్మాణం, రూ.15 లక్షలతో టాయిలెట్ బ్లాక్ నిర్మాణం, రూ.84 లక్షలతో షాపింగ్ కాంప్లెక్స్, రూ.26 లక్షలతో 40వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాoకు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందన్నారు. నెల నెలా నిధులు కేటాయిస్తూ స్థానిక సంస్థలను బతోపేతం చేస్తున్నారని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ప్రారంభమైన అంతర్రాష్ట్ర రాకపోకలు
ఉజ్జయిని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు
పిజ్జాలంటే ఇష్టమన్న మీరాబాయి.. జీవితకాలం ఫ్రీగా ఇస్తామన్న డొమినోస్
చేపల వేటకి వెళ్లి వ్యక్తి గల్లంతు
రైలు ఎక్కుతుండగా జారిన ప్రయాణికుడు.. రక్షించిన కానిస్టేబుల్