మెదక్, మార్చి 30 : ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షిస్తామని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ జి.రమేశ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మెదక్ జిల్లాకు మంచి పేరు తీసుకువస్తామ ని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో భూ కబ్జా, నీటి సమస్య లాంటి ఏ సమస్యలున్నా నా దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు. ప్రస్తుతం యాసంగిలో ధాన్యం సేకరణను పకడ్బందీగా నిర్వహిస్తామని తెలిపారు. ప్రభు త్వ భూములు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించ డం వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తానన్నారు. కరోనా రెండో దశ విస్తృతంగా వ్యాపిస్తున్నందున ప్రతి ఒక్కరూ తప్ప నిసరిగా మాస్క్లు ధరించాలని, భౌతిక దూరం పాటిం చాలని, శానిటైజ్ చేసుకోవాలని తెలిపారు. 60 ఏండ్ల పైబ డిన వారు టీకాలు వేసుకోవాలని సూచించారు. ఆయన వెంట మెదక్ ఆర్డీవో సాయిరాం, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్, ల్యాండ్ అండ్ సర్వే జిల్లా అధికారి గంగయ్య, మెదక్ తహసీల్దార్ రవికుమార్ ఉన్నారు.
ఇవీ కూడా చదవండి..
తేళ్లతో హోలీ కేళీ.. ఈ గ్రామం స్పెషల్..!
ఆస్పత్రిలో ఆక్సిజన్ పైప్తో ఉరేసుకుని కొవిడ్ బాధితుడి ఆత్మహత్య