సూర్యాపేట : కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని, బీఆర్ఎస్ పాలనకు ప్రస్తుత పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించారని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) అన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలోని టేకుమట్ల గ్రామంలో నల్లగొండ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం(Parliament elections) నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భువనగిరి, నల్లగొండ పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయం అయిందన్నారు. ప్రచారంలో మాకు వస్తున్న అపూర్వ ప్రజాస్పందనే దీనికి నిదర్శనం అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఖాయం అన్నారు. తమ ఓటమి ఖాయం అయిందనే పోలీసులను ఉపయోగించి బీఆర్ఎస్ శ్రేణులను భయపెడుతున్నారని, జానారెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి బ్రదర్స్తో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నేతల ఇళ్లకు వెళ్లి బెదిరించడం దుర్మార్గమని విమర్శించారు.
గడచిన నాలుగేళ్లలో ధాన్యం దిగుబడిలో దేశంలోనే నెంబర్ వన్గా ఉన్న నల్లగొండ జిల్లా ఈసారి ఎందుకు వెనుకబడిందని ప్రశ్నించారు? దీనికి కారకులు ఎవరైనా విషయాన్ని రైతులు గ్రహించారని చెప్పారు.
రైతుబంధు పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆడితున్న నాటకాలను రైతాంగం గ్రహించారని, ఎన్నికల్లో రైతుల ఆగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం గురికాక తప్పదని హెచ్చరించారు. మే 13వ తేదీన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలంతా కంకణ బద్ధులై ఉన్నారని పేర్కొన్నారు.