హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): గత పాలకుల 58 ఏండ్ల పాలనలో, తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి తేడాను గుర్తించి కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కోరారు. కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో తెలంగాణ అనేక విజయాలు నమోదు చేసిందని వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా.. ‘గత తొమ్మిదేండ్లలో జరిగిన అభివృద్ధి, అంతకుముందు 58 ఏండ్లలో జరిగిన పనులను చూడండి. అభివృద్ధికి ఓటెయ్యండి. కారు గుర్తుకు ఓటెయ్యండి’ అని ట్వీట్ చేశారు.
గతంలో 11 దఫాలు కాంగ్రెస్, టీడీపీ పాలనలో జరిగిన పనులు, రెండు దఫాల్లో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని వివరించారు. ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట దాకా, సిర్పూర్ నుంచి అలంపూర్ దాకా, భద్రాచలం నుంచి జహీరాబాద్ దాకా, తాండూరు నుంచి చెన్నూర్ దాకా, మధిర నుంచి ముథోల్ దాకా, మక్తల్ నుంచి జుక్కల్ దాకా కారు జోరు కొనసాగుతున్నదని, మళ్లీ కేసీఆర్ సర్కారే రానున్నదని ధీమా వ్యక్తం చేశారు. వివిధ రంగాల్లో గతంలో జరిగిన పనులు, గత తొమ్మిదేండ్లలో సాధించిన ప్రగతితోపాటు వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే చేపట్టనున్న కొత్త పథకాలను వివరించారు.
What was done in last 9 years by KCR Govt Versus 58 years of Previous Govts
Numbers speak for themselves
Vote for Progress, Vote for CAR#TelanganaWithKCR pic.twitter.com/iBtrfkyXwT
— KTR (@KTRBRS) November 28, 2023