GIS | హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) ట్వీట్ చేశారు. తమ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్( GIS )ను నిర్వహిస్తున్న వైజాగ్( Vizag )కు, సిస్టర్ స్టేట్ అయిన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతా శుభం జరగాలని కోరుకుంటున్నట్టు కేటీఆర్ పేర్కొన్నారు. ఈ దేశంలోనే తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందంజలో ఉండాలని కోరుకుంటున్నట్టు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
వైజాగ్లోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఈ నెల 3, 4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు పారిశ్రామికవేత్తలను, విదేశీ ప్రతినిధులను ఆహ్వానించనున్నారు. ఈ రెండు రోజుల సదస్సులో మొత్తం 9 రంగాలపై చర్చించనున్నారు. ఈ సదస్సులో 26 దేశాలు పాల్గొననున్నాయి. 8 వేల మంది అతిథులు, పెట్టుబడిదారులు హాజరు కానున్నారు.
Good luck to our younger brother Vizag & sister state AP as they conduct their Global Investors Summit
I wish them the very best 👍
May both Telugu speaking states prosper and be the best in India pic.twitter.com/v6UhGlZ7qP
— KTR (@KTRBRS) March 2, 2023