Minister KTR | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను (CM KCR) ఉద్దేశించి పార్లమెంట్లో బీజేపీ ఎంపీ బండి సంజయ్ (BJP MP Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ (Minister KTR) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోదీని అవమానించారన్న కారణంతో కాంగ్రెస్ ఎంపీపై చర్యలు తీసుకున్నారని.. మరి ఇప్పుడు సీఎం కేసీఆర్పై అత్యంత నీచమైన భాషలో మాట్లాడిన బీజేపీ ఎంపీని ఏం చేయాలో స్పీకర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేటీఆర్ శుక్రవారం ఉదయం ట్వీట్ చేశారు.
‘ప్రధాని ఇంటిపేరును అవమానకరంగా పిలిచినందుకు కాంగ్రెస్ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఇప్పుడు తెలంగాణకు చెందిన ఒక బీజేపీ ఎంపీ నిన్న లోక్ సభలో తెలంగాణ రాష్ట్రానికి రెండు సార్లు ఎన్నికైన పాపులర్ ముఖ్యమంత్రి కేసీఆర్ను అత్యంత నీచమైన భాషలో దూషించారు. ఇప్పుడు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఏం చేస్తారు..?’ అని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.
So an MP of Congress was disqualified from his membership for calling out PM’s surname in a derogatory way
Now a BJP MP from Telangana goes to great lengths and denigrates Telangana’s twice elected popular CM KCR in the filthiest language in Loksabha yesterday
What should…
— KTR (@KTRBRS) August 11, 2023
Also Read..
Rs.2000 Notes | బ్యాంక్లకు రూ.2 వేల నోట్ల తంటా..
Telangana | జీడీపీలో దేశానికి దన్నుగా నిలిచిన తెలంగాణ.. ఆరేండ్లలో 72 శాతం పెరిగిన రాష్ట్ర వాటా
FCI | కేంద్ర కొర్రీలు, ఎఫ్సీఐ సతాయింపులతో మిల్లుల్లోని మిగులు ధాన్యం బహిరంగ వేలం