దేశవ్యాప్తంగా రైతులు, మహిళలు.. ఇలా అన్ని వర్గాలు మోదీ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నాయి. ఈసారి 180 సీట్లు దాటవు
2019 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ‘బీజేపీ అబ్ కి బార్ 75 పార్’ అంటూ గప్పాలు కొట్టింది. చివరికి 40 సీట్ల దగ్గరే ఆగిపోయింది. ఈసారి కూడా 400 సీట్లు దాటుతామని చెప్పుకుంటున్నా 200 సీట్లు కూడా రావు
BJP | హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): ‘అబ్ కీ బార్.. 400 పార్’- ఇది లోక్సభ ఎన్నికల ప్రారంభానికి ముందు బీజేపీ హోరెత్తించిన నినాదం.రెండు దశల పోలింగ్ తర్వాత ఆ పార్టీ కనీసం ఆ పదం కూడా ఉచ్ఛరించడం లేదు. దీనిని బట్టే దేశంలో బీజేపీ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. బీజేపీ చెప్తున్నట్టు 400 కాదు.. కనీసం 200 కూడా దాటవనేది ప్రతిపక్ష నేతలు,రాజకీయ విశ్లేషకుల అంచనా. 2014లో బీజేపీ 428 స్థానాల్లో పోటీచేసి 282 సీట్లు గెలుచుకున్నది. 2019లో 436 సీట్లలో పోటీ చేసి 303 సీట్లు సాధించింది. బీజేపీకి గట్టి పట్టున్న రాష్ర్టాల్లో 330 ఎంపీ సీట్లు ఉండగా, ఇందులో 300 సీట్లు అంటే దాదాపు 80% గత ఎన్నికల్లోనే ఆ పార్టీ ఖాతాలో చేరాయి. అక్కడ ఈసారి స్థానికంగా నెలకొన్న పరిస్థితులు బీజేపీకి ప్రతికూలంగా మారే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. బీజేపీని పెద్దగా పట్టించుకోని ఇతర రాష్ర్టాల్లో ఈసారి పెద్దగా మార్పు కనిపించడం లేదు. దక్షిణాది రాష్ర్టాల్లో 2019లో వచ్చిన సీట్లు నిలబెట్టుకోవడమే కత్తిమీద సాముగా మారింది.
బీజేపీకి గట్టిపట్టున్న ఉత్తరాది రాష్ర్టాల్లో ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, బీహార్ వంటివి ప్రధానమైనవి. యూపీలో 80 సీట్లు ఉంటే, 2019లో ఆ పార్టీ ఏకంగా 62 స్థానాలు సాధించింది. ఈసారి రామ మందిర నిర్మాణంతో సీట్లు పెరుగుతాయని తొలుత బీజేపీ భావించినప్పటికీ, ఇప్పుడు ఆ వాతావరణం కనిపించడం లేదు. స్థానిక సమస్యలు ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
గుజరాత్, మధ్యప్రదేశ్లో ఈసారి కలిసొచ్చే లా కనిపిస్తున్నా.. రాజస్థాన్లో కాంగ్రెస్ బలం గా ఉన్నది. రాజస్థాన్లో ఈసారి 15 సీట్ల వర కే పరిమితం కావొచ్చనే అంచనాలున్నాయి.
మహారాష్ట్రలో ఏక్నాథ్ శిండే వ్యవహారం, అజిత్పవార్తో ఎన్సీపీలో చీలిక తేవడం వం టివి ప్రతికూలంగా మారనున్నాయి. పైగా వారికి పొత్తులో నాలుగైదు సీట్లు విదిల్చడం ఆగ్రహానికి దారి తీస్తున్నది. శరద్పవార్, ఉద్ధవ్ఠాక్రే ప్రభావం గట్టిగా ఉన్నదని, బీజేపీ సగం సీట్లు కోల్పోవచ్చనే అంచనాలున్నాయి.
బీహార్లో నితీశ్కుమార్ ఇష్టం వచ్చినట్టు పొత్తులు పెట్టుకొని, ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తుండటం పెద్ద మైనస్గా మారనున్నది.
హర్యానాలో గతంలో 10కి 10 బీజేపీ గెలుచుకున్నది.ఈసారి మనోహర్లాల్ కట్టర్ ప్రభుత్వం అర్థంతరంగా రాజీనామా చేయ డం, జేజేపీతో వివాదం వంటివి ప్రభావం చూపుతాయని అంటున్నారు.
జార్ఖండ్లో గతంలో 14కు 11 సీట్లు బీజేపీ గెలుచుకున్నది. కానీ, ఈసారి ఆ రాష్ట్ర సీఎం హేమంత్సోరెన్ను అరెస్ట్ చేయడంతో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, భారీగా ఎదురుదెబ్బ తప్పదని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. హేమంత్సోరెన్ అరెస్ట్ జార్ఖండ్కే పరిమితం కాదని.. దేశవ్యాప్తంగా ఎస్టీల ప్రాబల్యం ఉన్న రాష్ర్టాలన్నింటిలో బీజేపీకి ప్రతికూలంగా మారే అవకాశాలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఢిల్లీలో గత ఎన్నికల్లో బీజేపీ 7కి 7 గెలుచుకున్నది. కానీ, ఈసారి కేజ్రీవాల్ అరెస్ట్ తీవ్ర ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.
అస్సాంలో గతంలో 14కు 9 సీట్లు బీజేపీకి వచ్చాయి. కానీ ఈసారి సీఏఏ ప్రభావం చూపుతుందని, సీట్లు తగ్గుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఉత్తరాదిలో పశ్చిమబెంగాల్, పంజాబ్, ఒడిశా రాష్ర్టాలు బీజేపీకి కొరకరాని కొయ్యగా ఉన్నాయి. ఆయా రాష్ర్టాల్లో ఈసారి పెద్దగా మార్పేమీ ఉండకపోవచ్చని భావిస్తున్నారు.
పంజాబ్లోనూ కేజ్రీవాల్ అరెస్ట్ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు.
ఈశాన్య రాష్ర్టాల్లో మణిపూర్ అల్లర్ల ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నదని, అక్కడ ఒకటిరెండు కు మించి రాకపోవచ్చనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.
గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు గెలుచుకోగా.. రాజీనామాలు, ఎంపీల మరణాలు, ఉప ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలతో 14 స్థానాలు కోల్పోయింది. ప్రస్తుతం ఆ పార్టీకి లోక్సభలో 289 మంది సభ్యులు ఉన్నారు. ప్రధాని మోదీ చెప్పినదాని ప్రకారం సొంతంగా బీజేపీ 370 సీట్లు గెలుచుకోవాలంటే, 81 సీట్లు అదనంగా రావాలి. అందుకు బీజేపీకి రామమందిరం మినహా అనుకూల అంశాలేమీ కనిపించడం లేదు. ఇదే సమయంలో బీజేపీకి ప్రతికూలంగా మారే అంశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. పెట్రోల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడం, నిత్యావసర ధరలు పెరిగి సామాన్యుడి నడ్డి విరగడం, మూడు వ్యవసాయ నల్ల చట్టాలు, గిట్టుబాటు ధరకు హామీ లేకపోవడం, రైతు ఆత్మహత్యలు, ప్రభుత్వరంగ సంస్థల నిర్వీర్యం, డాలర్తో రూపాయి మారకం విలువ పడిపోవడం, రాష్ర్టాల మధ్య నీళ్ల పంచాయితీలు తీర్చకుండా చోద్యం చూడటం, బీజేపీ పాలిత రాష్ర్టాలపై ప్రేమ, విద్యుత్తు సంస్కరణల పేరుతో ఉచిత విద్యుత్తుకు ఎగనామం పెట్టడం, రాష్ర్టాల ఆర్థిక వ్యవస్థలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడం, సెస్సులు పిండుకోవడం.. ఇలా అనేక వ్యతిరేక అంశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇక బీజేపీతో స్నేహం అంటేనే పార్టీలు భయపడే పరిస్థితి దాపురించింది. ఎన్డీయేలో చేరితే పార్టీ ఖతమైనట్టేనని అకాలీదళ్, శివసేన వంటివి ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి చిన్నాచితకా పార్టీలతో కూటమి ఏర్పాటు చేసింది. పేరుకు 23 పార్టీల కూటమి అయినా.. జేడీయూ, టీడీపీ, ఏక్నాథ్ శిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ తప్ప మిగతా పార్టీలు కనీసం నాలుగైదు స్థానాల్లో కూడా పోటీ చేయలేని స్థాయిలో ఉన్నాయి.
సాధారణంగా బీజేపీ అంటేనే ‘అతి ప్రచా రం’ చేస్తుందని, ‘మైండ్గేమ్’ ఆడుతుందనే భావన ప్రజల్లో ఉన్నది. 2004లోనూ ‘భారత్ వెలిగిపోతున్నది’ అంటూ అతి ప్రచారం చేసి బొక్కబోర్లా పడిందని, ఈసారి కూడా అదే పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఎన్నికలు వచ్చి న ప్రతిసారీ 56 ఇంచుల ఛాతీ వంటి నినాదాలు, చైనా, పాకిస్థాన్ వాదాలు తీసుకొచ్చి పబ్బం గడుపుకుంటున్నారని చెప్తున్నారు. ఈసారి ఆ ఎత్తుగడలు ఫలించే అవకాశాలు లేవని చెప్తున్నారు. రెండు దశల పోలింగ్ తర్వాత బీజేపీ అంతర్గత సర్వేల్లోనూ ఇదే తరహా ఫలితం వచ్చినట్టు వార్తలు వస్తున్నా యి. అందుకే మొదట్లో ‘400 సీట్లు’ అంటూ ప్రచారం చేసిన బీజేపీ.. ఇప్పుడు గప్చుప్ అయ్యిందని చెప్తున్నారు. పైగా పూర్తిగా ‘హిందుత్వ’ అజెండాను ఎత్తుకొన్నారని గుర్తుచేస్తున్నారు.
దక్షిణాది రాష్ర్టాల్లో కర్ణాటక మినహా మిగతావన్నీ బీజేపీకి కొరకరాని కొయ్యగా ఉన్నాయి. కర్ణాటకలో మొత్తం 28 సీట్లకుగానూ బీజేపీకి 2019లో 25 స్థానాలు గెలుచుకున్నది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభు త్వం ఉండగా, ఎన్డీయే కూటమిపై ‘సెక్స్ స్కామ్’ పిడుగుపాటుగా మారనున్నది. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో గతం లో మాదిరిగానే ఖాతా తెరువకపోవచ్చని అంటున్నారు. తెలంగాణలో సిట్టింగ్ స్థానా లు నిలబెట్టుకోవడానికే కష్టపడుతున్న పరిస్థితి. గతంలో దక్షిణాది రాష్ర్టాల్లో బీజేపీకి 30 సీట్లు రాగా.. ఈసారి సగానికి పడిపోవచ్చని భావిస్తున్నారు.