Earth Quake : కేంద్రపాలిత ప్రాంతం లడఖ్ (Ladakh) లోని లేహ్ (Leh) లో గంటల వ్యవధిలో రెండుసార్లు భూకంపం (Earthquake) సంభవించింది. ముందుగా గురువారం ఉదయం ఆరు గంటలకు భూప్రకంపనలు వచ్చాయి. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు (Ricter Scale) పై 5.5 గా నమోదైంది. కేవలం నాలుగు గంటల వ్యవధిలో మళ్లీ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
లడఖ్ ఇప్పటికే తరచూ భూకంపాలు సంభవించే ప్రాంతంగా ఉన్నది. ఉదయం 9.54 గంటలకు భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత 4.3 గా నమోదైంది. భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ (NCS) వివరించింది. ఈ భూకంపంవల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని వెల్లడించింది.