KTR | రైతులను కూలీలను చేస్తం.. వ్యవసాయాన్ని ఖూనీ చేస్తాం.. పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వం.. ధాన్యం కొనుగోలు చేయమంటే దగా చేస్తాం.. మోటార్లకు మీటర్లు పెట్టాల్లె.. డిస్కమ్లను ప్రైవేటీకరణ చేయాలని కొంతమంది చావగొడతరని మంత్రి కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… మూడు వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి 700 మంది రైతుల ప్రాణాలు తీసింది ఎవరు అని ప్రశ్నించారు. ఇప్పటివరకు ఏ ప్రధాని అయినా అలాంటి పనిచేసిండా అని నిలదీశారు. 700 మంది చనిపోయారని అంటే నాకోసం చనిపోయారా? అని అన్న నాయకుడు ఎక్కడైనా ఉన్నారని అని మండిపడ్డారు. ఇంత దారుణంగా మాట్లాడే ప్రధాని ఎక్కడైనా ఉన్నాడా? ఈ దేశంలోనే కాదు ఏ దేశంలో ఉండడు అని విమర్శంచారు. ఉత్తరప్రదేశ్లో ఆందోళన చేస్తున్న రైతులపై జీపులు ఎక్కించి 8 మందిని తొక్కిసంపిన హంతకులే సంతాపం చెబుతూ మాట్లాడితే. వాళ్లు చెప్పింది వినాలా? ఇది మా కర్మ అంటూ అసహనం వ్యక్తం చేశారు.
‘ మేం రైతు రాజ్యం కావాలని అంటున్నం.. ఎద్దు ఏడ్చిన ఎవుసం బాగుండదు.. రాజు ఏడ్చిన రాజ్యం బాగుండదని మేమంటున్నం.. వాళ్లేమో కార్పొరేట్ రాజ్యం.. కార్పొరేట్ వ్యవసాయం కావాలని అంటున్నరు’ అని కేటీఆర్ అన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. ఎందుకు డిస్కమ్లను ప్రైవేటీకరించాలి? ఎందుకు మోటార్లకు మీటర్లు పెట్టాలని ప్రశ్నించారు. వాటికి లింక్ పెట్టి రాష్ట్రానికి ఇచ్చే అప్పుల్లో ఫిట్టింగ్ పెడుతున్నారని నిలదీశారు. ఎవరి ప్రయోజనాల కోసం కేంద్రం పనిచేస్తుందని అసెంబ్లీ సాక్షిగా నిలదీశాడు.
మా నాయకుడు మొన్ననే చెప్పిండు.. కార్పొరేటర్లది బాగా అయిపోయింది.. అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదాన్ని గౌరవనీయులు కేసీఆర్ నాయకత్వంలో దేశం మొత్తం వినిపిస్తాం.. తెలంగాణలో ఏం జరుగుతుందో దేశం మొత్తానికి చెప్తం.. ఒక రాష్ట్రంలో జరిగినప్పుడు దేశంలో ఎందుకు జరగదని కచ్చితంగా అడుగుతం.. ప్రజలను చైతన్యవంతులం చేస్తం.. ప్రధాన ప్రతిపక్షం విఫలమవుతున్న ఈ నేపథ్యంలో కచ్చితంగా ప్రత్యామ్నయంగా ఉద్భవిస్తం.. మా నాయకుడి నేతృత్వంలో కచ్చితంగా కదం తొక్కుతం. అని కేటీఆర్ సష్టం చేశారు.
2009లో నేను ఎమ్మెల్యే అయిన. 2004, 2002లోనే హరీశ్రావులోనే ఎమ్మెల్యే అయ్యిరు. అక్కడి కష్టాలు మాకు తెలుసు. అక్కడ ఆనాడు కాల్వలు లేవు.. ప్రాజెక్టులు లేవు.. చెరువులు ఎండిపోయినయ్.. బోరు బావులు తప్ప దిక్కులేదు.. ఆఖరికి కరెంట్ ఎంత దారుణం అంటే.. మా దగ్గర సెస్ అని ఉంటది.. చెబితే కన్నీళ్లు వస్తయి… ఆనాడు పరిస్థితి ఎట్ల ఉండే అంటే.. ఊళ్లల్ల ఎవరైనా చచ్చిపోతే.. కరెంట్ అధికారులకు ఫోన్ చేసి బతిమిలాడుకునేది.. అయ్యా ఒక్క అద్దగంట కరెంట్ ఇయ్యండి.. బాయికాడికి పోవల్లె.. అంత్యక్రియలు చేయాలె.. స్నానం చేయాలే అని అడుక్కునే పరిస్థితి ఉండేది. అని నాటి రోజుల్ని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. ఇయ్యాల వీళ్లు కూడా మాట్లాడతారా? అని కాంగ్రెస్ను ఉద్దేశించి కేటీఆర్ మండిపడ్డారు.
నాడు తెలంగాణ అంటే ఖాళీ పోయిన మీటర్లు.. పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు.. బోర్లా పడ్డ బతుకులు, బోర్ల రామిరెడ్డి వంటి బిరుదులు.. ఫెయిలైన బోర్లే ఇంటి పేర్లుగా మారిపోయిన పరిస్థితులు ఉండేవని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందుకు ఒక ఉదాహరణ కూడా చెప్పారు. మూసంపల్లి అనే ఒక ఊరులో రామిరెడ్డి అనే రైతు ఉండే.. ఆ రైతు 50 బోర్లు వేసిండు.. బోర్లు ఎస్తుండగా.. ఎస్తుండగా.. ఒకటో రెండో పడ్డట్టు ఉన్నయ్.. ఆయనది ఎట్లాంటి పరిస్థితి అంటే ఆయన పేరే బోర్లా రామిరెడ్డి అయిపోయింది. అని తెలిపారు. గట్ల బోర్ల పడ్డ బతుకులు.. బొక్కబోర్లబడ్డ వ్యవసాయం.. ఇది ఆనాటి పరిస్థితి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అట్లాంటి పరిస్థితి నుంచి తెలంగాణ ఏర్పడితే మూలిగిన నక్కపై తాటిపండు పడినట్టు.. విద్యుత్ కొరతతో ఉన్న తెలంగాణకు చావు దెబ్బ కొట్టింది అప్పటి కేంద్ర ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. ఏడు మండలాలను అనాగరికంగా ఏకపక్షంగా ఏడు మండలాలను ఆంధ్రకు కట్టబెట్టింది కేంద్ర ప్రభుత్వం కాదా? ఆనాడు వీళ్ల పరిపాలనలో ఉమ్మడి ప్రభుత్వం.. ఉమ్మడి పాలనలో అడుగడుగు పవర్ హాలీడేస్.. కానీ ఈ రోజు పవర్ ఫుల్ డేస్… ఎక్కడ కూడా చూసిన తెలంగాణలో కరెంట్కు ఇబ్బంది లేదు. ఆనాడు వీళ్ల పరిపాలనలో కరెంట్ ఉంటే వార్త.. ఇవాళ కరెంట్ పోతే వార్త కాదా అని కాంగ్రెస్ నేతలను నిలదీశారు.
మోదీ పాలనలో అన్నీ హైయెస్టే..అవేంటో తెలుసా? : మంత్రి కేటీఆర్
మీ మేకిన్ ఇండియా ఎక్కడవోయిందో తెలువదు.. మేము మేడ్ ఇన్ తెలంగాణ కళ్లద్దాలిస్తున్నాం