తెలంగాణ రాష్ట్రంలో వైద్య సౌకర్యాలు ఎలా ఉన్నాయో అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ వివరించారు. తెలంగాణ ఏర్పాటు కాకముందు ఇక్కడ కేవలం ఐదు మెడికల్ కాలేజీలు, ఏడు వందల సీట్లు ఉండేవని, తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ 17 మెడికల్ కాలేజీల్లో 2790, ప్రైవేటు కాలేజీల్లో 3800 కలిపి మొత్తం తెలంగాణలో 6590 ఎంబీబీఎస్ సీట్లు ఇవాళ తెలంగాణలో విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయన్నారు.
ఇంకా కొత్త ఆసుపత్రులో తెలంగాణలో బ్రహ్మాండంగా కడుతున్నామని, తెలంగాణలోనే అన్నిటికన్నా పెద్ద ఆసుపత్రి, వరల్డ్ క్లాస్ సౌకర్యాలతో వరంగల్లో కడుతున్నామని, 24 అంతస్తులు, రెండువేల పడకలతో సకల హంగులతో నిర్మిస్తున్నామని మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో చెప్పారు. ఇదే కాదు హైదరాబాదులో గల్లీ గల్లీకో ప్రాథమిక వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేసి పేదలకు దిగ్విజయంగా పేదలకు వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు.
ఇవాళ రెండోసారి రాష్ట్ర ప్రజలకు కంటివెలుగు కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. కంటి వెలుగులో కంటి పరీక్షలే కాదు అత్యంత నాణ్యమైన కళ్లద్దాలు కూడా ఇస్తున్నామని, అదీ మెడ్ ఇన్ తెలంగాణ అద్దాలు ఇస్తున్నామని చెప్పారు. మీ మోదీ మెక్ ఇన్ ఇండియా ఎక్కడవోయిందోగానీ మా మేక్ ఇన్ తెలంగాణ మాత్రం కళ్లముందు కనవడుతున్నదని చెప్పారు.