జగిత్యాల : జిల్లాలోని వెల్గటూర్ మండలం పట్టణ పరిధిలో వెలసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి పట్నాల, జాతర ఉత్సవాల్లో సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎల్లంపల్లి లింకు -2 ప్రాజెక్టులో ముంపునకు గురై ఉపాధి కోల్పోతున్న వెల్గటూర్, రాజక్కపల్లి గౌడ సంఘం సొసైటీ కి అభివృద్ధికి రూ.43 లక్షల 35 వేలు పరిహారాన్ని మంత్రి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి కోల్పోతున్న గౌడన్నలకు ప్రభుత్వం 4 ఎకరాల భూమి పట్టాలను అందజేసామని గుర్తు చేశారు. ఉపాధి కోల్పోతున్న మత్స్య కార్మికులకు గత వారంలో రూ.20 లక్షల పరిహారాన్ని అందజేసినట్లు మంత్రి వివరించారు. నిర్వాసితులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందన్నారు.
ఇవి కూడా చదవండి..
రైతులు డిమాండ్ ఉన్న పంటలనే పండించాలి
బీచ్లో శ్రద్దాదాస్ షికార్లు..ఫొటోలు వైరల్
త్వరలో టీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం : మంత్రి ఎర్రబెల్లి
మాస్క్ ధరించాలని పోలీసుల ప్రచారం
గిరిజన మహిళలను పారిశ్రామిక వేత్తలుగా మారుస్తున్న సీఎం కేసీఆర్