(Gangula:) కరీంనగర్: జిల్లాకు మణిహారంగా రూ.183 కోట్లతో కేబుల్ బ్రిడ్జి ఏర్పాటు పనులు పూర్తికావచ్చాయని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ప్రస్తుతం కమాన్ నుంచి కేబుల్ బ్రిడ్జి వరకు రూ.40 కోట్లతో రోడ్డు నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ నిర్మాణం పనులు జరుగుతున్నాయని చెప్పారు. కేబుల్ బ్రిడ్జి వద్ద దేశంలోనే తొలిసారిగా రూ.6 కోట్లతో డైనమిక్ లైట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతులకు సర్వీస్ రోడ్డు ఇతర సదుపాయాలకు మరో రూ.7 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఆదివారం ఉదయం ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు.
జిల్లాతోపాటు పొరుగు జిల్లాల ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న కేబుల్ బ్రిడ్జి మూడు నెలల్లోనే అందుబాటులోకి రానున్నదని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్ నుంచి సిరిసిల్ల వెళ్లే రోడ్డును అద్భుతంగా తయారుచేస్తున్నామన్నారు. కాకతీయ కెనాల్పై మరో బ్రిడ్జి రూ.30 కోట్లతో నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఉప ఎన్నిక తర్వాత జిల్లా అభివృద్ధికి రూ. 350 నిధులు కేటాయించగా.. రూ.100 కోట్ల పనులు ఇప్పటికే పూర్తి ఆయ్యాయన్నారు. మరికొన్ని పనులు త్వరలోనే పూర్తవుతాయని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై చిన్న చూపు చూస్తున్నది మంత్రి గంగుల మండిపడ్డారు. బియ్యం కొనుగోలు విషయంలో కేంద్రం రాతపూర్వకంగా ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని, కేంద్రం దిగొచ్చే వరకు ఆందోళన కొనసాగుతుందని చెప్పారు. అవసరమైతే బియ్యం తీసుకెళ్లి ఢిల్లీలో కుమ్మరిస్తామని, రైతుల తరపున ఎంత దూరమైనా కొట్లాడేందుకు సిద్ధమని గంగుల తెలిపారు.
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..