జనగామ : రైతులు ఆర్థికంగా ఎదగాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని పాలకుర్తి, కొడకండ్ల మండల కేంద్రాల్లో డీసీసీబీ బ్యాంకులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ రోజు మహిళా సంఘాలకు ఐదు కోట్ల రుణాలు అందజేస్తున్నామని తెలిపారు. వ్యాపారస్తులకు కూడా లక్ష రూపాయల వరకు రుణాలను అందజేస్తామన్నారు. రైతుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో రైతులు రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడులు సాధించారని గుర్తు చేశారు. రైతులు డీసీసీబీ బ్యాంకులను ఉపయోగించుకోవాలని మంత్రి సూచించారు.
ఇవి కూడా చదవండి..
ద్విచక్ర వాహనాలు దొంగలిస్తున్న ముఠా అరెస్ట్
ఎల్లో బికినీలో కియారా రచ్చ..!
ఉద్యమంలా పట్టణ ప్రగతి : ఎమ్మెల్యే ఆరూరి
బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్
పల్లెప్రగతితో మారిన జీవన పరిస్థితులు : మంత్రి ఎర్రబెల్లి