యాదాద్రి: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట వెళ్లిన మంత్రి ఎర్రబెల్లి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా, అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న మంత్రి ఎర్రబెల్లి దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.