మహబూబాబాద్ : జిల్లాలోని తొర్రూర్ డివిజన్ కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ 87 వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమానికి జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు జయశంకర్ సార్ అని కొనియాడారు.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ సార్ సేవలు మరిచిపోలేనివన్నారు. కడవరకు తెలంగాణ కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.
రాష్ట్ర సాధన కోసం మొదలైన మలిదశ ఉద్యమంలో ఆయన పాత్ర అజరామరంగా నిలుస్తుందని మంత్రి తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఉద్యమం మొదలు పెట్టిన రోజున జయశంకర్ సార్ మార్గదర్శనం చేసారని ఆయన కొనియాడారు. జయశంకర్ సార్ ఆలోచన విధానం మేరకే ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
‘రైతు బీమా’ దరఖాస్తునకు చివరి తేదీ ఆగస్టు 11
Tokyo Olympics: మెడల్పై ఆశలు రేపుతున్న గోల్ఫర్ అదితి
Nanajipur waterfalls : హైదరాబాద్కు చేరువలో అద్భుతమైన జలపాతం
Lionel Messi: సంచలనం.. బార్సిలోనా నుంచి మెస్సీ ఔట్