వరంగల్ : ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు హన్మకొండకు చెందిన టైలర్ వి.రాజేశ్వర్ (సంగెం టైలర్) మృతి పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆనాడు స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని అనేక మంది ప్రజలను ప్రభావితం చేసిన వ్యక్తిగా రాజేశ్వర్ అని కొనియాడారు.
ఆ తర్వాత కూడా తమ టైలర్ వృత్తిని కొనసాగిస్తూ అత్యంత సాదాసీదాగా జీవితాన్ని గడిపిన ధన్యుడని పేర్కొన్నారు. రాజేశ్వర్ మృతితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
Rakesh Tikait : జో బైడెన్కు రాకేశ్ తికాయత్ ట్వీట్.. ఏం చెప్పాడంటే?
IPL 2021 | కోల్కతా కెప్టెన్ మోర్గాన్కు షాక్.. 24 లక్షల జరిమానా
అట్టహాసంగా నమస్తే తెలంగాణ ఆటో షో ప్రారంభం