అబుదాబి: ఐపీఎల్ 2021( IPL 2021 )లో సెకండ్ లెగ్ను విజయంతో ప్రారంభించినా.. కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్కు మరో రూపంలో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా అతనికి రూ.24 లక్షల జరిమానా విధించారు. సాధారణంగా స్లో ఓవర్ రేటుకు రూ.12 లక్షల జరిమానానే విధించాల్సి ఉన్నా.. ఈ సీజన్లో కోల్కతా ఇలా చేయడం రెండోసారి కావడంతో జరిమానా రెట్టింపైంది. ఇక టీమ్ సభ్యులకు రూ.6 లక్షలు లేదా మ్యాచ్ఫీజులో 25 శాతం.. ఇందులో ఏది తక్కువ అయితే అంత మొత్తం జరిమానా విధించినట్లు ఐపీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మ్యాచ్లో రాహుల్ త్రిపాఠి, వెంకటేశ్ అయ్యర్ చెలరేగడంతో ఈ మ్యాచ్లో కోల్కతా సునాయాసంగా గెలిచిన విషయం తెలిసిందే. ఈ విజయంతో కోల్కతా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది.