నిజామాబాద్ : జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ మైదానంలో నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే సంయుక్తంగా తలపెట్టిన ఆటో షో అట్టహాసంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ వెంకటరమణ, నమస్తే తెలంగాణ ప్రకటనల విభాగం జనరల్ మేనేజర్ సురేందర్ రావు కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
మొత్తం 24 స్టాళ్లు ఏర్పాటు చేయగా ఇందులో వివిధ సంస్థలకు చెందిన వాహనాలను ప్రదర్శించారు. మెర్సిడెస్ బెంజ్, స్కోడా, మారుతి సుజుకి, హోండా, నిస్సాన్, ఎంజి, కియా హ్యుందాయ్, మహేంద్ర కంపెనీలకు చెందిన వాహనాలు తరలివచ్చాయి. ప్రదర్శనలో బ్యాటరీతో నడిచే ద్విచక్ర వాహనాలు కూడా విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.