MLC Kavitha | కేంద్ర ప్రయోజిత పథకాల పేర్లను మారస్తున్న బీజేపీ ప్రభుత్వం.. ఆ పథకాల్లో భాగంగా రాష్ట్రాలకు అందించే తన వాటాను మాత్రం పెంచడం లేదని బీఆర్ఎస్ ఎమ్మల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. కేంద్ర పథకాల అమలు కోసం సరిపడా నిధులు ఇవ్వకుండా రాష్ట్రాలపై అదనపు భారం మోపుతుందని ఆరోపించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పీఎం పోషణ్ కింద మార్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. తమ వేతనాలను సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రూ.3వేలకు పెంచినందుకు గానూ మధ్యాహ్న భోజన వర్కర్లు కృతజ్ఞతలు తెలిపారు. తమ వేతనాల పెంపు కోసం కృషి చేసిన ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్లో కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం కేవలం పథకాల పేర్లు మార్చడానికే పరిమితమైందని ధ్వజమెత్తారు. మధ్యాహ్న భోజన పథకం పేరును పీఎం పోషణ గా మార్చిన కేంద్ర ప్రభుత్వం వర్కర్లకు ఇస్తున్న తన వాటాను మాత్రం పెంచలేదని విమర్శించారు. కానీ మధ్యాహ్న భోజన వర్కర్ల వేతనాలను రూ.3 వేలకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం తన వాటాగా కేవలం రూ. 600 మాత్రమే చెల్లిస్తుందని, మిగతా రూ. 2400 రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నదని వివరించారు.
ప్రజలంతా గౌరవప్రదంగా జీవించాలన్నదే బీఆర్ఎస్ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అందుకే కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా కూడా మధ్యాహ్న భోజన వర్కర్ల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని తెలిపారు.
మోదీ పాలనలో అన్నీ హైయెస్టే..అవేంటో తెలుసా? : మంత్రి కేటీఆర్
KTR | బరాబర్ మాది కుటుంబపాలనే.. విపక్షాలకు మంత్రి కేటీఆర్ కౌంటర్
మీ మేకిన్ ఇండియా ఎక్కడవోయిందో తెలువదు.. మేము మేడ్ ఇన్ తెలంగాణ కళ్లద్దాలిస్తున్నాం