హుజూర్నగర్ : ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఎమ్మెల్యే అధ్యక్షతన టీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమావేశానికి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి హాజరయ్యారు.
అనంతరం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఎంసీ కోటి రెడ్డి పార్టీకి చేసిన సేవలను గుర్తించి వారి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిర్ణయించారన్నారు. కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజాప్రతినిధులందరూ కోటిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్కు బహుమతిగా ఇవ్వాలన్నారు.
ఇవి కూడా చదవండి..
రైతు సంఘాల కమిటీకి సర్కార్ తాజా ప్రతిపాదన : నిర్ధిష్ట హామీలకు ఎస్కేఎం పట్టు
Nallagonda | సంతోషిమాత ఆలయంలో గవర్నర్ ప్రత్యేక పూజలు
కుప్పకూలిన హెలికాప్టర్లో బిపిన్ రావత్ : వాయుసేన