కరీంనగర్ : దేశానికే ఆదర్శంగా తెలంగాణ దళిత బంధు పథకం నిలుస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. హుజరాబాద్ నియోజకవర్గం ఇల్లందకుంట మండల కేంద్రంలో మండల ఇంచార్జి, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ నేతృత్వంలో దళితులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..డా. బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత దళిత బంధు పథకం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.
పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. సీఎం చారిత్రాత్మక నిర్ణయంతో దళితుల జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసరిస్తాయన్నారు. సబ్బండ వర్గాలు ఆర్థికంగా ఎదిగేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. దళిత బంధు పథకం ద్వారా దళితులు ఎవరి మీద ఆధారపడకుండా తమ కాళ్ల మీద తామే బతుకొచ్చన్నారు.
ఈ పథకం కోసం దళితులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం కానీ, పైరవీలు చేయాల్సిన అవసరం అంతకన్నా లేదన్నారు. నేరుగా వారి అకౌంట్ లోనే డబ్బు జమ అవుతాయని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
రేపటి నుంచి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
దళిత బంధు చరిత్రలో నిలిచిపోతుంది : ఎల్. రమణ
చరిత్రలో ఈరోజు.. 14 బ్యాంకులను జాతీయం చేసిన ఇందిరాగాంధీ
అక్రమంగా పట్టా చేసుకున్నాడని.. పంట పొలంలోనే కట్టేశారు